బెజ్జంకి, మే 7 (ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలోని హనుమాన్ టెంపుల్లో గురువారం ఆలయ ప్రధాన పూజారి కాచం వెంకటేష్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్తులు ఘనంగా హోమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకం, నవగ్రహ పూజలు, అష్టోత్తర శతనామార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కాచం వెంకటేష్ దంపతులు స్వామివారికి అన్నప్రసాద వితరణ చేశారు . ఈ కార్యక్రమంలో ఎర్రల రాజు, హనుమాన్ భక్త స్వాములు, గ్రామ భక్తులు పాల్గొన్నారు.

