మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) గిద్దలూరు పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ నందు యువ బీజేపీ నాయకులు దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి తండ్రి దప్పిలి ప్రసాద రెడ్డి జ్ఞాపకార్ధం హాస్పిటల్ కు వచ్చే పేషెంట్ ల కు వేసవి తాపానికి చల్లని నీటిని అందించే ఉద్దేశ్యం తో కూలింగ్ వాటర్ ఫ్రిజ్ ను డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా ఏం ఎల్ ఎ శ్రీ అశోక్ రెడ్డి తమ్ముడు యువ నాయకులు ముత్తు ముళ్ళ కృష్ణ కిషోర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ,బీజేపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట రామాంజనేయులు, ఓ బి సి మోర్చా జిల్లా కార్య వర్గ సభ్యులు వీర చక్రము, గిద్దలూరు మార్కెట్ యార్డ్ బోర్డు మెంబర్ బాదుల్లా, సంతోష్ కుమార్, మునగ నూరి రామక్రిష్ణ, రాచర్ల మండల బీజేపీ జనరల్ సెక్రటరీ ధనలక్ష్మి,హాస్పిటల్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది.
గవర్నమెంట్ హాస్పిటల్ కు కూలింగ్ వాటర్ ఫ్రిజ్ డొనేట్ చేసిన బీజేపీ నాయకులు
RELATED ARTICLES




