📄 ePaper
Tuesday, July 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 5 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన పుర్మా రాణి–మధు దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ పాల్గొని శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అర్హత ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావు నరసయ్య, దేవస్థానం మాజీ చైర్మన్ జెల్లా ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోనాల మల్లేశం, వార్డు సభ్యుడు భోనగం రమేష్, ఎలిగే సతీష్, నాయకులు పురుమ నారాయణరెడ్డి, సంఘ రమేష్, గుండెని ఎల్లయ్య, బండి వేణు, జవాజీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular