అందోల్ గురుకుల బాలికల కళాశాలలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు
మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 15 అందోల్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
అందోల్ గురుకుల బాలికల కళాశాలలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు భక్తిశ్రద్ధలతో వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వినాయకునికి పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. విద్యార్థినులలో భక్తిభావం, ఐక్యతను పెంపొందించేలా కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.

