📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamముగిసిన గడువు..? పందిళ్ళపల్లి మాజీ కార్యదర్శి పై విచారణ ఏమాయేను...?

ముగిసిన గడువు..? పందిళ్ళపల్లి మాజీ కార్యదర్శి పై విచారణ ఏమాయేను…?

📰 Generate e-Paper Clip

*

*8నెలలు గడుస్తున్న ప్రజావాణి దరఖాస్తుకు మోక్షం ఎన్నాళ్లకు…?



*ఆదేశాలు అందిన 10 రోజుల్లో వివరణలు ప్రశ్నార్థకమే….?


ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి


ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి రేకుల షెడ్డు వ్యవహారంలో గత ఏడాది నవంబర్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామానికి చెందిన బాధితులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో నాటి డిపిఓ రాంబాబు సమగ్రంగా రెండు దశల్లో విచారణ చేసి విచారణ నివేదిక జిల్లా కలెక్టర్కు ఇటీవల సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ మాజీ పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మాటూరు పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఆ మేరకు వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా గత నెల 23 వ తారీఖున స్థానిక మధిర మండల పరిషత్ అభివృద్ధి అధికారి ద్వారా సంబంధిత లేఖ అందినట్లు సమాచారం. కాగా అధికారిక ఆదేశాలు అందిన పది రోజుల్లో సదరు పంచాయతీ కార్యదర్శి వివరణాలు ఇవ్వాల్సి ఉండగా నేటికీ అందించలేదని సమాచారం విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో విచారణ పలు దశల్లో ముగించిన జిల్లా పంచాయతీ అధికారులు ఆ మేరకు నివేదిక కొన్ని నెలల అనంతరం అందినట్లు సమాచారం. ఇటీవల ఇచ్చిన ఆదేశాలు ప్రకారం సివిల్ సర్వీసెస్ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించినట్లు వెలుగు చూసిన నేపథ్యంలో అందిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకో ని సదరు మాజీ పంచాయతీ కార్యదర్శి రికార్డులను  తారుమారు చేసి వ్యవహారం గుట్టుగా ఉంచినట్లు కొన్ని రికార్డులు అందుబాటులో లేవంటూ వ్యాఖ్యానించటం విశేషం. గతంలో విధులు నిర్వహించిన మాజీ పంచాయతీ కార్యదర్శి రికార్డులు భద్రంగా ఉన్నట్లు తెలపటం గమనార్హం. ఈ రికార్డులను ప్రామాణికంగా తీసుకోని 2017 సంవత్సరంలోఓ పంచాయతీ కార్యదర్శి రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించకుండా ఇష్టానుసారంగా ఆన్లైన్ ప్రక్రియ చేసినట్లు సమాచారం. దీంతో ఇటీవల నవంబర్ నెలలో ఓ కుటుంబం అక్రమంగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసి తనకా పెట్టి సుమారు 360000 రుణం ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ నుండి పొందినట్లు ఆధారాలతో సహా అధికారులకు సమాచారం అందిందని తెలిసింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి స్పందించి చొరవ తీసుకొని మాజీ పంచాయతీ కార్యదర్శి పై విచారణ ప్రక్రియ వేగవంతంగా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు జిల్లా ప్రజలు స్థానికులు కోరుతున్నారు.

Previous article
Next article
ఉద్యమమే ఊపిరిగా… సామాజిక న్యాయమే లక్ష్యంగా బుర్రి సతీష్ ప్రస్థానం సమాజంలో మార్పు అనేది ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు. దాని కోసం ఆలోచన, అంకితభావం, త్యాగం, నిరంతర పోరాటం అవసరం. అలాంటి పోరాటయోధులలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ ఒకరు. విద్యార్థి ఉద్యమాల నుంచి సామాజిక ఉద్యమాల వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. చిన్ననాటి నుంచే సేవాభావం బుర్రి సతీష్ చిన్ననాటి నుంచే మంచి విలువలు, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యతతో పెరిగారు. చెడు మార్గాలకు దూరంగా ఉంటూ, చదువు ద్వారానే జీవితాన్ని నిర్మించుకోవాలని భావించారు. కుటుంబం అందించిన విలువలు, గురువుల ప్రోత్సాహం, సమాజంలో కనిపించిన అసమానతలు ఆయన ఆలోచనలను ప్రభావితం చేశాయి. చిన్న వయస్సులోనే ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించే మనస్తత్వం ఆయనలో పెరిగింది. యూనివర్సిటీ జీవితంలో నాయకత్వ వికాసం యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన సమయంలోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు మరింత పదునెక్కాయి. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారం కోసం పోరాడే విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. హాస్టల్ సమస్యలు, విద్యా సౌకర్యాలు, స్కాలర్‌షిప్‌లు, సామాజిక న్యాయం వంటి అంశాలపై విద్యార్థులను చైతన్యపరుస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా ఆయన చేసిన ప్రయాణం కేవలం యూనివర్సిటీ గోడలకే పరిమితం కాలేదు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే యువత ముందుకు రావాలని భావించి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమం అంటే ప్రజల మధ్య ఉండి వారి సమస్యలకు గొంతుక కావడమేనని ఆయన తన ఆచరణ ద్వారా చాటిచెప్పారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో బుర్రి సతీష్ విద్యార్థి ఉద్యమకారుడిగా చురుకుగా పాల్గొన్నారని ఆయనతో కలిసి పనిచేసిన వారు చెబుతుంటారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో బలంగా వినిపించేందుకు కృషి చేశారు. విద్యార్థి శక్తి సమాజ మార్పుకు ఎంతటి బలమో తెలంగాణ ఉద్యమం నిరూపించినట్లే, ఆ ఉద్యమంలో భాగస్వామ్యం ఆయన సామాజిక చైతన్యాన్ని మరింత బలోపేతం చేసింది. ఎమ్మార్పీఎస్‌తో ఉద్యమ ప్రస్థానం విద్యార్థి ఉద్యమాల అనంతరం ఆయన అడుగులు ఎమ్మార్పీఎస్ వైపు మళ్లాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమ భావజాలాన్ని స్వీకరించి, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో భాగమయ్యారు. ఎస్సీ వర్గీకరణ, సామాజిక సమానత్వం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, అణగారిన వర్గాల అభ్యున్నతి వంటి అంశాలపై ఎమ్మార్పీఎస్ చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యత ప్రస్తుతం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బుర్రి సతీష్ ఉద్యమానికి బలమైన స్వరంగా నిలుస్తున్నారు. ఉద్యమ లక్ష్యాలను ప్రజలకు వివరించడం, మీడియాతో సమన్వయం, ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం, యువతలో ఉద్యమ చైతన్యం పెంపొందించడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆయన ప్రసంగాల్లో సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు, సమాన అవకాశాలు, విద్య ప్రాధాన్యత వంటి అంశాలు ప్రధానంగా వినిపిస్తుంటాయి. ఉద్యమం అంటే కేవలం నిరసన మాత్రమే కాదు, ప్రజల్లో అవగాహన పెంచడం కూడా అంతే ముఖ్యమని ఆయన నమ్ముతారు. మందకృష్ణ మాదిగతో కలిసి సాగుతున్న ప్రయాణం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేయడం బుర్రి సతీష్ ఉద్యమ జీవితంలో ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. ఉద్యమ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, యువతను ఉద్యమం వైపు ఆకర్షించడంలో, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడంలో ఆయన తన వంతు పాత్రను పోషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సభలు, సమావేశాలు, చర్చలు, చైతన్య యాత్రల్లో పాల్గొంటూ ఉద్యమానికి బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకోవడం, వాటిని ఉద్యమ వేదికలపై ప్రస్తావించడం ఆయన ప్రత్యేకత. యువతకు ఆదర్శం విద్యార్థి నాయకుడిగా మొదలైన ప్రయాణం, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం, ఆ తరువాత ఎమ్మార్పీఎస్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం ద్వారా బుర్రి సతీష్ యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. చదువుతో పాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించవచ్చని ఆయన జీవితం తెలియజేస్తుంది. ముగింపు ఒక సాధారణ విద్యార్థి నుంచి ఉద్యమ నాయకుడిగా ఎదగడం వెనుక ఉన్న అంకితభావం, పట్టుదల, ప్రజల పట్ల నిబద్ధత బుర్రి సతీష్ ప్రస్థానాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. సామాజిక న్యాయం కోసం ఆయన కొనసాగిస్తున్న ప్రయాణం మరింత బలపడాలని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి మరింత విస్తరించాలని కోరుకుందాం. సమాజ మార్పు కోసం నడిచే ప్రతి అడుగులో సేవాభావం, నిబద్ధత, బాధ్యత ఉంటేనే నిజమైన నాయకత్వం ఆవిష్కృతమవుతుందనే విషయాన్ని ఆయన ప్రస్థానం గుర్తు చేస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular