📄 ePaper
Thursday, July 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గాగిల్లాపూర్ గ్రామ కరీంనగర్ డెయిరీ చైర్మన్‌గా చింతలపల్లి కొండారెడ్డి

గాగిల్లాపూర్ గ్రామ కరీంనగర్ డెయిరీ చైర్మన్‌గా చింతలపల్లి కొండారెడ్డి

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 8 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ కరీంనగర్ డెయిరీ సహకార సంఘం పాలకవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. చైర్మన్‌గా చింతలపల్లి కొండారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా బద్ధం సతీష్ రెడ్డి, ఏలేటి ప్రశాంత్ రెడ్డి, అన్నాడి మల్లారెడ్డి, నేరెళ్ల లక్ష్మణ్, పొన్నాల సంజు, రాగి సురేష్, బొమ్మవేణి ఎల్లయ్య, సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులకు గ్రామస్తులు, పాల ఉత్పత్తిదారులు అభినందనలు తెలియజేస్తూ, డెయిరీ అభివృద్ధికి కృషి చేసి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular