📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఐదుకల్లు గ్రామస్తుల తాగునీటి కష్టాలు: తక్షణమే స్పందించిన టీడీపీ యువ నాయకుడు దేవినేని ధర్మతేజ

ఐదుకల్లు గ్రామస్తుల తాగునీటి కష్టాలు: తక్షణమే స్పందించిన టీడీపీ యువ నాయకుడు దేవినేని ధర్మతేజ

📰 Generate e-Paper Clip

కళ్యాణదుర్గం (మే21 ప్రజావాణి) మండల పరిధిలోని ఐదుకల్లు గ్రామంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ధర్మతేజ గారు దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానికులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు.​ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాలతో రంగంలోకి టీడీపీ యువ నాయకుడు దేవినేని ధర్మ తేజ.గ్రామస్తుల విన్నపంపై ధర్మతేజ తక్షణమే స్పందించారు. ఈ సమస్యను స్థానిక శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు గారి దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి ఆదేశాల మేరకు టీడీపీ యువ నాయకుడు ధర్మతేజగారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు.​గ్రామంలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించడానికి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ​సమస్య పరిష్కారానికి ముమ్మర కృషి ​ఐదుకల్లు గ్రామంలో తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయేలా అధికార యంత్రాంగంతో కలిసి నిరంతరం శ్రమిస్తామని ఈ సందర్భంగా ధర్మతేజ గారు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం,ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నాయకత్వంలో ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.​తాగునీటి సమస్యపై సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారికి, యువ నాయకుడు ధర్మతేజగారికి ఐదుకల్లు గ్రామ ప్రజలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.