బెజ్జంకి,మే 10(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలలోని గుగ్గిళ్ల గ్రామ ఉపసర్పంచ్ దుగ్యానీ లావణ్య -మోహన్ ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా సమస్త మాతృమూర్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అమ్మ అంటే కేవలం ఒక పదం కాదని, ప్రతి మనిషి జీవితంలో తొలి గురువు, దేవత, స్నేహితురాలు అని,కుటుంబం కోసం తన సుఖాలను త్యాగం చేస్తూ, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే ప్రతి అమ్మ నిస్వార్థ ప్రేమకు నిలువుటద్దమని,సమాజ నిర్మాణంలో, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని,మాతృమూర్తుల త్యాగాలను గౌరవిస్తూ, వారి పట్ల ఎల్లప్పుడూ ఆదరణ చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అమ్మలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

