మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి: రైతుల ధర్నా
చెన్నారావుపేట మే 6 ప్రజావాణి
చెన్నారావుపేట మండల మండలం మొక్కజొన్న కొనుగోళ్లు బుధవారం నత్తనడకన సాగుతో విసిగిపోయిన రైతులు నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. గత 20 రోజులుగా కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని, వర్షం ముప్పు పొంచి ఉన్నందున వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. అనంతరం రైతుల సమస్యలపై తహసీల్దార్కు వినతిపత్రం. ఈ నిరసనలో బీజేపీ నాయకులు కూడా పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.

