చిలుకూరు ఏప్రిల్ 21(ప్రజావాణి*):జేఈఈ మెయిన్స్ సెషన్- 2 ఫలితాలను సోమవారం ఎన్ టి ఏ విడుదల చేసింది. ఈ ఫలితాలలో కోదాడ పట్టణంలో రేస్ కళాశాలలో చదివిన మొక్క చరణ్ సాయి 99.56 పర్సంటైజ్ సాధించి జాతీయస్థాయిలో 1583 ర్యాంకు సాధించాడు. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన మొక్క లక్ష్మీనారాయణ కుమారుడు చరణ్ సాయి ప్రాథమిక విద్య నుండి మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్నాడు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థిని కోదాడ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత రెడ్డి అభినందించారు.


