*సొంత వ్యాపారాలపై యువత దృష్టి సారించాలి*
– చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి
మేడ్చల్, ప్రజావాణి:-
యువత సొంత వ్యాపారాలపై దృష్టి సారించి ఇంకొంత మందికి ఉపాధి కల్పించే ఎదగాలని అలియాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి అన్నారు. బుధవారం అలియాబాద్ మున్సిపల్ కేంద్రంలో మేడిపల్లి శివ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కట్ట మైసమ్మ వెల్డింగ్ షాప్ ను స్థానిక కౌన్సిలర్లతో కలిసి చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా వ్యాపారాలు నిర్వహించి పదిమందికి మార్గదర్శకంగా నిలవాలన్నారు. సొంత వ్యాపారం పై దృష్టి సారించిన శ్రీ కట్ట మైసమ్మ వెల్డింగ్ షాప్ నిర్వాహకుడు మేడిపల్లి శివ ను శిరీష కృష్ణారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాన్ రెడ్డి మాలతి మాధవరెడ్డి, కౌన్సిలర్లు మౌనిక దినేష్, యమున శ్యామ్, జస్వంత్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

