శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానములో శ్రావణమాస శుక్రవారం ప్రత్యేక కృష్ణాష్టమి పూజా కార్యక్రమం.
పెనుగంచిప్రోలు సెప్టెంబర్ 04 మన ప్రజావాణి
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని తొలుత దేవస్థానం గోశాలలో గోవులకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నిత్యకళ్యాణ మండపంలో సుమారు 1,500 మంది ముత్తైదువులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించూట జరిగినది.
సామూహిక కుంకుమార్చనలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో పాల్గొని శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని పూజించారు. ఈ సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి చైర్మన్ చుంచు రమేష్ బాబు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానములో శ్రావణమాస శుక్రవారం ప్రత్యేక కృష్ణాష్టమి పూజా కార్యక్రమం
RELATED ARTICLES

