నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం లైసెన్సుడ్ సర్వేయర్లు నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. చండూరు మండలానికి చెందిన మంగళవారం స్థానిక ముందస్తు లైసెన్స్డ్ సర్వేయర్లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు గుర్తించారు. ఈ సందర్భంగా లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూతరాజు మురళీ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై శాంతియుత నిరసన తెలపడానికి వెళ్తుంటే అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు కాలరాయడం ప్రభుత్వ హేయమైన చర్య అని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వేయర్ల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలన్నారు. అరెస్టయిన వారిలో సర్వేయర్లు కొమ్ము గణేష్, గుడిసె విజయ్, పులకరం కళ్యాణ్ ఉన్నారు.

