“బైరాన్ పల్లి”అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర టి పి సి సి కార్యదర్శి కొండల్ రెడ్డి
మద్దూరు సెప్టెంబర్ 17, ప్రజా వాణి,
తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని గురువారం మండలంలోని బైరాన్ పల్లి గ్రామ బురుజు వద్ద అమరవీరులకు రాష్ట్ర టి పి సి సి కార్యదర్శి, మాజీ జడ్ పి టి సి గిరి కొండల్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ
నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలకు
వ్యతిరేకంగా ప్రాణాలు ప్రాణంగా పెట్టి పోరాడిన
అమరవీరుననుస్మరించుకుంటూ
స్వేచ్ఛ గగనాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన
వీర యోధులకు వందనాలు సమర్పిస్తూ
తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
దూల్మిట్ట మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్,
గ్రామ పెద్దలు యువకులు
మరియు గ్రామా శాఖ అధ్యక్షులు
జిల్లా కార్య దర్శులు
తదితరులు పాల్గొన్నారు.

