📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్లలో ‘సిండికేట్’ దందా: క్వార్టర్ బాటిల్‌పై రూ. 10 నుండి 20 అదనం.చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్...

పోరుమామిళ్లలో ‘సిండికేట్’ దందా: క్వార్టర్ బాటిల్‌పై రూ. 10 నుండి 20 అదనం.చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ*

📰 Generate e-Paper Clip

వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 9 ప్రజావాణి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని కలస్పాడు కాశినాయన పోరుమామిళ్ల లో  వైన్ షాపులు నిబంధనలను నిలువునా పాతర వేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట విక్రయ ధరలకే (మ్యాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ – మద్యం విక్రయించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మద్యం బాటిల్‌పై, ముఖ్యంగా క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ. 10 నుండి రూ. 20 వరకు వసూలు చేస్తూ సామాన్య ప్రజలను, గిరాకీదారులను నిలువునా దోచుకుంటున్నారు. ఈ బహిరంగ దోపిడీపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, స్థానిక ఎక్సైజ్ (ఎక్స్ఛేంజ్) అధికారులు మాత్రం ‘మాకేమీ పట్టనట్టు’ చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

ఎంఆర్‌పీ బోర్డులు మాయం.బెల్ట్ షాపుల హల్‌చల్

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానంలో భాగంగా ప్రతి వైన్ షాపు ముందు స్పష్టంగా కనిపించేలా విక్రయ ధరల  పట్టికను ప్రదర్శించాలని ఆదేశించింది. కానీ పోరుమామిళ్ల మండలంలోని పలు దుకాణాల్లో ఈ బోర్డులు ఎక్కడా కనిపించవు.ఒకవేళ ఉన్నా,వాటిని వినియోగదారులకు కనపడకుండా మరుగున పెడుతున్నారు.విక్రయదారులను ధరల గురించి ప్రశ్నిస్తే.”పైనుంచే మాకు అదనపు ఖర్చులు ఉన్నాయి, ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు” అంటూ దురుసుగా సమాధానం ఇస్తుండటం గమనార్హం. మరోవైపు మండలంలోని పల్లె ప్రాంతాల్లో అనధికారిక బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.ఈ బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసేందుకు వైన్ షాపుల నిర్వాహకులు నిలకడగా ధరలను పెంచేసి, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.పోరుమామిళ్లలో జరుగుతున్న ఈ మద్యం దందాపై ఇటీవలే సీపీఎం  వంటి ప్రజా సంఘాలు మరియు రాజకీయ పార్టీలు తీవ్ర నిరసనలు వ్యక్తంచేశాయి. మద్యం విక్రయాల్లో జరుగుతున్న ఈ అక్రమ వసూళ్లను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన స్థానిక ఎక్సైజ్ అధికారులపై, ముఖ్యంగా సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పై  ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్!1

కొన్ని నెలల క్రితమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రవ్యాప్తంగా ఎంఆర్‌పీ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంఆర్‌పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా సదరు దుకాణానికి మొదటి విడతగా రూ. 5 లక్షల జరిమానా విధించాలని, అక్రమాలు పునరావృతమైతే ఏకంగా లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ, పోరుమామిళ్ల మండలంలో ఈ ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.

ఎక్సైజ్ అధికారుల కళ్లప్పగింత.మామూళ్ల మత్తులో ఉన్నారా?పోరుమామిళ్ల కేంద్రంగా ఇంత పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లు జరుగుతున్నా ఎక్సైజ్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ‘మామూళ్ల’ కథే నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుకాణాల నిర్వాహకులతో అధికారులు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని, అందుకే తనిఖీల పేరిట కేవలం నామమాత్రపు చర్యలు చేపడుతూ కాలయాపన చేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.పోరుమామిళ్ల మండలంలోని మందుబాబులు మరియు సామాన్య పౌరులు ఈ అక్రమ వసూళ్లపై నిశ్శబ్దంగా ఉండిపోకుండా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.టోల్-ఫ్రీ నెంబర్: అక్రమ మద్యం అమ్మకాలు మరియు ఎంఆర్‌పీ ఉల్లంఘనలపై టోల్-ఫ్రీ నెంబర్ 14500 లేదా హెల్ప్‌లైన్ నెంబర్ 0866-2575051 కు కాల్ చేసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.పోరుమామిళ్ల మండలంలో సాగుతున్న ఈ అక్రమ దోపిడీకి అడ్డుకట్ట పడాలంటే జిల్లా ఉన్నతాధికారులు మరియు కడప జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ తక్షణమే రంగంలోకి దిగాల్సి ఉంది. ఇక్కడి మద్యం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వినియోగదారుల నుండి అదనంగా వసూలు చేస్తున్న సొమ్మును అరికట్టాలని, అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న స్థానిక అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోరుమామిళ్ల కంస్పాడు కాశినాయన  మండల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు మిగతా వివరాలు రేపటి సంచికలో మీ ప్రజావాణి ప్రజల ముందు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.