ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న ప్రజావాణి రిపోర్టర్
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతిని ప్రజావాణి న్యూస్ రిపోర్టర్ మునిపల్లి నరేష్ యాదవ్ సోమవారం తొలి రోజు దర్శించుకున్నారు. మహాగణపతి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకుని ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

