ఏ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా హేమంత్ కుమార్ ఎన్నిక
ప్రజావాణి అనంతపురం సెప్టెంబర్ 7 ఏ ఎస్ ఎఫ్ జిల్లా జిల్లా అధ్యక్షుడిగా కురుబ హేమంత్ కుమార్ ఎన్నిక చేయడం జరిగింది ఈ సందర్భంగా సోమవారం నగరంలోని స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నందు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యల పట్ల విద్యాసంస్థలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం వివిధ అంశాలపై చర్చించడం జరిగింది అంతే కాకుండా విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫీజులు కట్టే సమయంలో ఎంత ఒత్తిడికి లోనవుతున్న విషయాలపై ఆరా తీశారు అనంతరం అనంతపురం జిల్లా నూతనంగా కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆ సంఘం వ్యవస్థాపకులు హేమాద్రి యాదవ్ మరియు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేబి నారాయణస్వామి ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మధు ప్రసాద్ హాజరయ్యారు విద్యార్థుల సమస్యలను ఎలా ఎదుర్కోవాలి మరియు ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై వివరించారు నూతన అధ్యక్షుడికి శాలువగప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు హేమాద్రి యాదవ్ కి అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు సమస్యల పట్ల రాజీలేని పోరాటాలు చేస్తానని ఆ దృఢ సంకల్పం తనలో ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు ప్రకాష్ వెంకటేశులు తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు

