📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ

ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ

📰 Generate e-Paper Clip

మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణకు పిలుపు

ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ

ఎల్లంపేట్: వినాయక చవితిని పురస్కరించుకొని ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రజలకు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో విగ్రహాలను స్వీకరించారు. శ్రీ వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సర్వతోముఖ అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపాలిటీ పిలుపునిచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP), రసాయన రంగులతో తయారైన విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున సహజ మట్టితో తయారు చేసిన విగ్రహాలను వినియోగించాలని సూచించారు. మట్టి వినాయకుడు – పర్యావరణ పరిరక్షణకు మన బాధ్యత” అనే సందేశంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.