ఉపాద్యాయ వృత్తి ఎంతో ప్రాముఖ్యమైంది
ఉపాద్యాయ దినోత్సవ వేడుకల్లో ఎంఈఓ వరదరాజు
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
మద్దూరు సెప్టెంబర్ 18, ప్రజా వాణి,
అన్ని వృత్తుల్లోకెల్ల ఉపాద్యాయ వృత్తి ఎంతో ప్రాముఖ్యమైందని మద్దూరు మండల విద్యాశాఖాధికారి వరదరాజులు అన్నారు.శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా సర్వే పల్లి రాదా కృష్ణ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ దామెర మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దూలిమిట్ట మండల విద్యాశాఖాధికారి కర్ణాకర్ రెడ్డి, మద్దూరు కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్ ఓ స్వప్న, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్,ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మహిళ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

