అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, బోనాల కార్యక్రమాలకు రూ.25 వేల విరాళం
నంగునూరు, ఆగస్టు 23:
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ ముత్యాల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల నిర్వహణకు గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తమ వంతు సహకారం అందించింది. ఇందులో భాగంగా సంఘం తరఫున రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని నిర్వాహకులకు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామ ప్రజల ఐక్యతకు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తమ సంఘం ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. అలాగే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కూడా తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

