బెజ్జంకి, ఆగస్టు 26 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని,స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సేవలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు తమకు కేటాయించిన స్మార్ట్ రేషన్ కార్డులను సకాలంలో తీసుకుని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సుదమల్ల ప్రశాంత్, వార్డు సభ్యులు దూశెట్టి రాజిరెడ్డి, గ్రామ పాలన అధికారి శ్రీనివాస్, కొంకటి ఆగయ్య, సంతోష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

