📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguపేదల కోసం పోరాడిన నాయకుల జీవితాలు ఆదర్శం ఎర్ర జెండాలతో మారుమోగిన వర్ధంతి సభ

పేదల కోసం పోరాడిన నాయకుల జీవితాలు ఆదర్శం ఎర్ర జెండాలతో మారుమోగిన వర్ధంతి సభ

📰 Generate e-Paper Clip

పేదల కోసం పోరాడిన నాయకుల జీవితాలు ఆదర్శం
.ఎర్ర జెండాలతో మారుమోగిన వర్ధంతి సభ.

.ఏపి సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు.
.జోహర్ కామ్రేడ్ రామదాసు, సుబ్బమ్మ.

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)*:-
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా నాయకులు కామ్రేడ్ విరపనేని రామదాసు, సుబ్బమ్మ 6వ వర్ధంతి సభను సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారి స్వగృహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.సభా ప్రాంగణాన్ని ఎర్ర జెండాలు, పూల మాలలతో అలంకరించారు. రామదాసు, సుబ్బమ్మ చిత్రపటాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఎం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు హాజరై చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో రామదాసు, సుబ్బమ్మ పోషించిన పాత్ర అమూల్యమని కొనియాడారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటాలు ఈ ప్రాంత చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినవని తెలిపారు. పేద ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం, భూమిలేని రైతుల కోసం వారు జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు.
సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రామదాసు, సుబ్బమ్మ త్యాగాలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న అసమానతలను, దోపిడీని ఎదుర్కోవడానికి వారి ఆదర్శాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు చేసిన కృషిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అన్నారు.పేదలు, దళితులు, గిరిజనుల హక్కుల కోసం వారు చేసిన ఉద్యమాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడంలో రామదాసు, సుబ్బమ్మ చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా సభలో పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో మహిళా సంఘాలు, యువజన సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ నేటి రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధతకు రామదాసు, సుబ్బమ్మ జీవితాలు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంలో, ప్రజా సమస్యలపై పోరాడడంలో వారి స్ఫూర్తిని కొనసాగించాలని తీర్మానించారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రజా సమస్యలపై సీపీఎం పార్టీ ఉద్యమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.సభలో పలు తీర్మానాలు ఆమోదించారు. రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల అమలు, కనీస వేతనాల పెంపు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రామదాసు, సుబ్బమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని వక్తలు కోరారు.సీపీఎం మండల కార్యదర్శి సభ కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ కార్యదర్శులు, కార్యకర్తలు కార్యక్రమాన్నిమనం విజయవంతం చేశారు. సభ చివరన అమరవీరులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సభా ప్రాంగణంలో “జోహార్ కామ్రేడ్ రామదాసు, సుబ్బమ్మ” అనే నినాదాలు మారుమోగాయి. కార్యక్రమానికి వచ్చిన వారికి సీపీఎం నాయకులు స్వాగతం పలికారు. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం వచ్చిన సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సభతో రామదాసు, సుబ్బమ్మ ఆశయాలు మరోసారి గుర్తుకు వచ్చాయని ప్రజలు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.