📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా సీత్ల పండుగ జేఏసీ మండల అధ్యక్షులు బోడ...

ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా సీత్ల పండుగ జేఏసీ మండల అధ్యక్షులు బోడ మురళి నాయక్ పిలుపు చెన్నారావుపేట జూలై 04 ప్రజావాణి గిరిజనుల ఆచారాలు, సంస్కృతికి ప్రతీకయైన సీత్ల పండుగను ఈ నెల 7వ తేదీ (మంగళవారం) నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని తండాలలో ఒకేసారి ఘనంగా నిర్వహించుకోవాలని జేఏసీ కమిటీ మండల అధ్యక్షుడు బోడ మురళి నాయక్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ పండుగ గిరిజనుల ఐక్యతకు, ఆత్మగౌరవానికి నిదర్శనమని, ప్రతి కుటుంబం, యువత, పెద్దలు భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు.పూర్వీకుల సంప్రదాయాలను భావితరాలకు అందించేలా,ఐక్యతే మన బలం అనే నినాదంతో సంస్కృతిని కాపాడుకోవాలని ఆయన మండలంలోని గిరిజన సంఘాల నాయకులు గ్రామ పెద్దలు యువతులు మహిళలు ప్రజా ప్రతినిధులు ప్రతి గిరిజన కుటుంబం ఈ పండుగలో పాల్గొని తమ తమ తండాల్లో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో చిత్ర పండగను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

📰 Generate e-Paper Clip

జేఏసీ మండల అధ్యక్షులు బోడ మురళి నాయక్ పిలుపు

చెన్నారావుపేట జూలై 04 ప్రజావాణి

గిరిజనుల ఆచారాలు, సంస్కృతికి ప్రతీకయైన సీత్ల పండుగను ఈ నెల 7వ తేదీ (మంగళవారం) నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని తండాలలో ఒకేసారి ఘనంగా నిర్వహించుకోవాలని జేఏసీ కమిటీ మండల అధ్యక్షుడు బోడ మురళి నాయక్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ పండుగ గిరిజనుల ఐక్యతకు, ఆత్మగౌరవానికి నిదర్శనమని, ప్రతి కుటుంబం, యువత, పెద్దలు భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు.పూర్వీకుల సంప్రదాయాలను భావితరాలకు అందించేలా,ఐక్యతే మన బలం అనే నినాదంతో సంస్కృతిని కాపాడుకోవాలని ఆయన మండలంలోని గిరిజన సంఘాల నాయకులు గ్రామ పెద్దలు యువతులు మహిళలు ప్రజా ప్రతినిధులు ప్రతి గిరిజన కుటుంబం ఈ పండుగలో పాల్గొని తమ తమ తండాల్లో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో చిత్ర పండగను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.