📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వృద్ధాశ్రమంలో ఘనంగా కర్నాటి వెంకటరెడ్డి 48 వ జన్మదిన వేడుకలు

వృద్ధాశ్రమంలో ఘనంగా కర్నాటి వెంకటరెడ్డి 48 వ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

* దేవినేని సుబ్బారెడ్డి,ఎంబడి సుధాకర్,పసుపులేటి సాయి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
* వృద్ధులకు అన్నదానం,స్వీట్ల పంపిణీ

వైఎస్ఆర్ కడప జిల్లా జూన్ 26 ప్రజావాణి పోరుమామిళ్ల మండల బాలమ్మ సత్రం లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం  సేవా దృక్పథంతో కూడిన ఒక అద్భుతమైన వేడుక జరిగింది.రాజకీయ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి 48వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, స్థానిక బాలమ్మ సత్రం వద్ద ఉన్న వృద్ధుల మధ్య పుట్టినరోజు సంబరాలను అత్యంత ఘనంగా,అర్థవంతంగా నిర్వహించారు.సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు అండగా నిలవాలనే సత్సంకల్పంతో,ఎలాంటి ఆడంబరాలకు పోకుండా ఈ సేవా కార్యక్రమాలను చేపట్టారు.పుట్టినరోజు కార్యక్రమానికి హాజరై న వారు టిడిపి కడప పార్లమెంటు మాజీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతా రెడ్డి,కేక్ కట్ చేసి ఆశ్రమంలోని వృద్ధుల ఆశీస్సుల నడుమ కర్నాటి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు.అనంతరం అక్కడి వృద్ధులందరికీ కడుపు నిండా భోజనాలు,స్వీట్లను స్వహస్తాలతో పంపిణీ చేశారు.తమ పుట్టినరోజున ఇలాంటి మానవీయ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల స్థానికులు,వృద్ధులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ,దీవెనలు అందజేశారు.ఈ సేవా కార్యక్రమం దేవినేని సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో,వారి పర్యవేక్షణలో విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా దేవినేని సుబ్బారెడ్డి మాట్లాడుతూ.పుట్టినరోజు వేడుకలను వృద్ధుల మధ్య జరుపుకుంటూ సమాజ సేవకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి నాయకులు మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు, కార్యకర్తలు సుధాకర్,పసుపులేటి సాయి తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.