📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్CITU 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - కలస్పాడులో ఘనంగా జెండా ఆవిష్కరణ

CITU 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – కలస్పాడులో ఘనంగా జెండా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

కలసపాడు (మే30 ప్రజావాణి) కలసపాడులోని వి ఆర్టీసీ బస్టాండ్ ముందు ఉన్న సిఐటియు జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ షేక్ ఓబులాపురం విజయమ్మ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందిఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యురాలు ఓబులాపురం విజయమ్మ సిఐటియు మండల కార్యదర్శి గుడిమే.ఇషాక్ సంయుక్తంగా వారు మాట్లాడుతూ,కార్మిక సంఘాలను ఏకం చేయడంలో  పాత్ర చాలా కీలకమైంది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీ అయినా సరే,తప్ప అన్ని పార్టీలతో కార్మికుల సమస్యల కోసం ఐక్యమవుతుంది, ఐక్యం చేసింది. ఇలాంటి తరుణంలో ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని” పిలుపునిచ్చారు “1970 మే 30న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఇతర సంఘాల నుండి విడిపోయి  ఏర్పడింది.1974లో రైల్వే 17 లక్షల మందితో సమ్మె చేసి విధానాలను దేశ ప్రజలకు తెలియజేసింది.1982లో ముంబైలో టెక్స్టైల్స్ సమ్మె 5 లక్షల మందితో 18 నెలలు సమ్మె చేసి విజయాలు సాధించింది.మహిళా కార్మికుల కోసం ప్రత్యేక ఉప సంఘం ఏర్పాటు చేసి మహిళా కార్మికుల కోసం నాయక పోరాటం నిర్వహిస్తోంది.నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు వర్గాలకు సంఘీభావం తెలుపుతోంది. ప్రత్యక్ష ఉద్యమాలలో పాల్గొంటోంది”అని తెలిపారు దేశంలో అతిపెద్ద కార్మిక సంఘాల్లో అగ్రభాగాన ఉన్నది. కాంట్రాక్ట్ విధానం,లేబర్ కోడ్‌లు, ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా ఎప్పుడూ దేశవ్యాప్తంగా పోరాడుతోంది” అని వారు అన్నారుదేశంలో సిఐటియు కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పనిచేస్తుందని వారన్నారు వేలాది కార్మికులు సిఐటియు జెండాను ముద్దాడుతున్నారు *ఇప్పటికే బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా 44 చట్టాలు ఉన్నటువంటి కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మికుల పైన ఉక్కు పాదం మోపడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారుఇప్పటికైనా బిజెపి ప్రభుత్వము 44 చట్టాలను అమలు చేయాలని లేని పక్షం అయితే కార్మికులు పెద్ద ఎత్తున బిజెపి ప్రభుత్వాన్ని పూలదగడం తప్పదన్నారు 8 గంటల పని దినాలను 12 గంటలు పని దినాలుగా మారుస్తున్న బిజెపి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా వారు అన్నారు దేశంలో బిజెపి మోడీ సర్కార్ ఇప్పటికైనా కార్మికుల పక్షాన నిలబడితే గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా వారు అన్నారు లేని పక్షం అయితే తన గూర్చి గాలికి కొట్టుకుపోతుందని వారు అన్నారుఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు నాయకులు,కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.