
వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ ఏప్రిల్21 పోరుమామిళ్ల సీనియర్ జర్నలిస్ట్ మద్దికాయల బాలరామిరెడ్డి కన్నుమూ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మద్దికాయల బాలరామిరెడ్డి గారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పాత్రికేయ రంగంలో సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన మృతి పట్ల జర్నలిస్ట్ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కలం కార్మికుడిగా ఎన్నో సామాజిక అంశాలపై ఆయన తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.బాలరామిరెడ్డి గారి మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు. పలువురు ప్రముఖులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాము .




