
కడప జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్16) కడప కర్నూల్ జాతీయ రహదారిపై కారును ఢీకొన్న వాహనం ముందువైపు ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలు.గాయపడ్డ వ్యక్తులు దువ్వూరు మండలానికి చెందిన మోహన్ రెడ్డి శంకర్ రెడ్డి గా గుర్తింపు.ఇరువురిని మెరుగైన చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్ కు తరలింపు.అదే కారు చాపాడు మండలం పల్లగోలు వద్ద వ్యక్తిని ఢీకొనడంతో మైదుకూరుకు చెందిన కొండయ్య మృతి.కొండయ్య పని నిమిత్తం మైదుకూరు నుండి ప్రొద్దుటూరుకు వెళుతుండగా చోటు చేసుకున్న ప్రమాదం.ప్రమాదం చేసిన వ్యక్తి కడప పట్టణం అక్కాయి పల్లెకు చెందిన కొట్టే ప్రశాంత్ గా గుర్తింపు.ప్రశాంత్ సాఫ్ట్వేర్ ఉగ్యోగి భార్య కాపురానికి రాలేదన్న టెన్షన్ లో వేగంగా కారు నడిపినట్టు సమాచారం.కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన చాపాడు పోలీసులు.
