
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) కలసపాడు మండలంలోని ఎగువ తంబళ్లపల్లి గ్రామ పంచాయతీలో వీధిలైట్లను టిడిపి యువ నాయకుడు చంద్రగిరి ప్రహ్లాద రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నరేష్ కుమార్ రెడ్డి, షేక్ నరసాపురం పెద్దబాబు ,మాజీ డీలర్ కాజా రహమతుల్లా, హనుమంతు రాజయ్య, గంగసాని రమణారెడ్డి ,సయ్యద్ భాష ,షేక్ నరసాపురం మబ్బులు ,ఎం అనిల్ కుమార్ ,ఓసూరి జేమ్స్ ,తలారి నరసింహులు, జార్జి రమేష్, పలువురు టిడిపి యువ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో అక్కడక్కడ నీటి సమస్యను గుర్తించిన యువ నాయకులు నీటి సమస్యను కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని తెలియజేశారు .
