బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి జాతర విజయవంతం
బెజ్జంకి,ఏప్రిల్ 3(ప్రజావాణి )
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఏకశిల కొండపై కొలువుదిరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా, విజయవంతంగా నిర్వహించబడ్డాయి. జాతర సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, బెజ్జంకి ఎస్సై సౌజన్య ఆధ్వర్యంలో పలు పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు తీసుకున్న సమర్థ చర్యల వల్ల జాతర ప్రశాంతంగా కొనసాగి విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై లు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్లు పాల్గొన్నారు.




