
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) పోరుమామిళ్ళ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డు ఇరువైపులా బోర్డింగ్ పాయింట్లుగా నిలపడం వల్ల బద్వేల్, మైదుకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు, పట్టణం నుంచి వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో తరచుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై పోలీసులు వెంటనే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

