నూతన అడ్వకేట్ తోగరు బుచ్చిరెడ్డికి ఘన సన్మానం
చెన్నారావుపేట జూలై 24 ప్రజావాణి
మండలంలోని జల్లి గ్రామానికి చెందిన తోగరు బుచ్చిరెడ్డి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించి అడ్వకేట్గా ఎంపికైనందుకు శుక్రవారం ప్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలో బుచ్చిరెడ్డికి శాలువా కప్పి, స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ సుబాన్, రిపోర్టర్లు సుదర్శన్, అమ్రూ నాయక్, వీరారెడ్డి, రమేష్, రాజు, రజాకర్, అశోక్, భాస్కర్, రాజేందర్, వీరభద్రు, తిలక్, రామకృష్ణ, వీరన్న తదితరులు పాల్గొన్నారు.




