బెజ్జంకి, ఏప్రిల్ 17(ప్రజావాణి)
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో సర్పంచ్ దేవనబోయిన సత్యవ్వ–పోచయ్య చేతుల మీదుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహన దారులకు,గ్రామ ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ శ్రీనివాస్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, సిఏ రేణుక,సంధ్య, శ్రీలత, కల్లూరి ప్రభాకర్, కల్లూరి బాలయ్య, చాడ బాల్ రెడ్డి, దేవనబోయిన అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

