ఘట్కేసర్ ఏప్రిల్ 17 (ప్రజావాణి) మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8 వ వార్డ్ లింగాపురం కి చెందిన కనుకుంట్ల ప్రసాద్ మాదిగకు దళితరత్న అత్యుత్తమ పురస్కారం గౌరవ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ప్రసాద్ దళిత సంఘాలకు మరియు ఎమ్మార్పీఎస్ లో చేసిన సేవలకు గాను ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది. ప్రసాద్ మాట్లాడుతూ దళిత సంఘాలు మరియు ఎమ్మార్పీఎస్ లో సేవలు గుర్తించిన పెద్దలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎన్ వై అశోక్ మాదిగ, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంధి గారి నర్సింగరావు మాదిగ, బి నాగేష్ నాయక్, ఈసాయి తదితరులు పాల్గొన్నారు.
కనుకుంట్ల ప్రసాద్ మాదిగకు దళితరత్న అవార్డు
0
7
- Advertisment -

