ఎండపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. పొలానికి ట్రాక్టర్ ద్వారా ఎరువు (పెంట) తరలిస్తుండగా, ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి కింద పడి తొట్ల మహేష్ (28) అనే యువ రైతు మృతి చెందాడు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా జరిగిన ఈ ఘటన తో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ పైనుంచి జారిపడి యువ రైతు మృతి
RELATED ARTICLES




