హన్మకొండ లో ఘనంగా ప్రారంభించిన జీవ మల్టి సూపర్ స్పెషలిటీ హాస్పటల్
ప్రజావాణి 1ఆగష్టు 2026 అందుబాటు ధరలో ఆధునిక వైద్య సేవలు అందించాలి ఏసీబీ ప్రశాంత్ రెడ్డి అత్యధిక వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన జీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శనివారం ఘనంగా ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆస్పత్రిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో వైద్య విద్య వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు ప్రైవేట్ ఆసుపత్రులు లాభాపేక్షతోపాటు సేవా భావంతో పనిచేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఒకరి ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పుణ్యకార్యం మరొకటి లేదని పేర్కొన్న ఆయన ఆరోగ్యమే మనిషి జీవితానికి నిజమైన సంపద అని అన్నారు ఆరోగ్యం బాగుంటేనే విద్యాభ్యాసం ఉపాధి వ్యవసాయం వంటి కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు ఆరోగ్య సమస్యల ను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు ఆధునిక వైద్య పరికరాలు నిపుణులైన వైద్యులతో జీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హనుమకొండ తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే కేంద్రంగా ఎదగాలని అయినా ఆకాంక్షించారు





