*చంద్రుగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే
చండ్రుగొండ, ప్రజావాణి న్యూస్, జూలై 30:
అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలంలో గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు నిర్వహించారు.ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేష్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ఘన స్వాగతం పలికి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది.”ప్రజల అభివృద్ధే మా లక్ష్యం – ప్రజా సంక్షేమమే మా ధ్యేయం” అని గృహ, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నల్లమోతు రమణ, మాజీ జెడ్పిటిసి అంకిరెడ్డి కృష్ణారెడ్డి,బొజ్యా నాయక్,గుగులోతు బాబు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేష్,మరియు వందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రుగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే
RELATED ARTICLES




