గ్రామీణ విద్యార్థుల ప్రతిభ కు పట్టాభిషేకం……
ప్రజావాణి మే 02: మోతే మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఎస్ ఎస్ సి పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలలో మండల ప్రథమ, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులు వై.సలోని(553), కె.భానోదయ(550) లను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఘనంగా సత్కరించారు.వీరు మాట్లాడుతూ భవిష్యత్ లో మీరు మరెంతో ఉత్తమ ప్రతిభను కనబర్చారణాలని సూచించారు.ఇంతటి ఘనకీర్తిని కనులార చూసిన తల్లి తండ్రులు ఆనందం లో మునిగి పోయారు.

