నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02) వింజమూరు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో మర్యాదపూర్వక భేటి అయిన వింజమూరు నూతన ఎస్సై ఉమామహేశ్వరరావు.శాంతి భద్రతలపై దృష్టి సారించాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల.వింజమూరులో ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ని వింజమూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఉమామహేశ్వరరావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్,మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్సై సమర్థవంతంగా పనిచేయలని, ప్రజలతో సాన్నిహిత్యంతో (ఫ్రెండ్లీ పోలీసింగ్) విధులు నిర్వహిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజల సమస్యలకు త్వరితగతిన స్పందిస్తూ,న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సహచర సిబ్బందితో సమన్వయంతో పని చేస్తూ, వింజమూరు మండలంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో మర్యాదపూర్వక భేటి అయిన వింజమూరు నూతన ఎస్సై ఉమామహేశ్వరరావు..!
RELATED ARTICLES

