బెజ్జంకి,జూన్ 23(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు పట్టేందుకు తీసుకొచ్చిన వడ్లు పట్టు మిషన్లు ఎండలోనే ఉంచడంతో పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధిక ఉష్ణోగ్రతల కారణంగా మిషన్ దెబ్బతినే అవకాశం ఉందని,మిషన్ ఎండలో ఉంటే,మల్లి కొనుగోలు కేంద్రాలలో వడ్లు స్టార్ట్ ఐతే ఇబ్బందులు ఏర్పడి కొనుగోలు ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు వెంటనే స్పందించి మిషన్ను ఎండ తగలకుండా మార్కెట్ యార్డ్ లేక షెడ్ లేదా నీడ ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.




