అంధకారంలో 11 వర్డ్…. పట్టించుకోని పాలకవర్గం
సిద్దిపేట మర్కుక్, జూన్ 8, ప్రజావాణి
మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీ 11వ వార్డులో పక్షం రోజులుగా అంధకారంలో ఉంది. కూలి నాలి చేసుకొని తిరిగి ఇంటికి వద్దాం అంటే కాలనీలో వీధి దీపాలు వెలుగుగాక విద్యానగర్ నుంచి 11 వరకు అంధకారంలో ఉంది. సంబంధిత వార్డు సభ్యునికి,, పాలకవర్గానికి,పంచాయతీ సెక్రెటరీ పలుమార్లు తెలిపిన పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వీధి దీపాలు వెలిగేలా చూడాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు..


