చిలుకూరు మార్చి 30:( ప్రజా వాణి )
కోదాడ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు బ్రదర్ కె రామారావు అధ్యక్షతన చిలుకూరు మండలంలోని సీతారామపురం గ్రామంలో సోమవారం కవనెoట్ చర్చ్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఏర్పాటు మీటింగ్ జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా డిసిప్లిన్ కమిటీ చైర్మన్ రెవరెండ్.డాక్టర్.యెషయా వర్తమానం అందించారు.కోరి కమిటీ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ శ్రావణ్ కుమార్ వర్కింగ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ కోరి కమిటీ వైస్ ప్రెసిడెంట్ గుడిబండ ఏషియా మరియు ఎలక్షన్ కమిటీ సభ్యులు ఎన్నిక నిర్వహించి, ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందించారు.
నియోజకవర్గంలోని వివిధ మండలాల ఈ అధ్యక్షులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు,చిలుకూరు మండల అధ్యక్షుడు పాస్టర్ రమేష్ , అనంతగిరి మండల అధ్యక్షులు పాస్టర్ రాజేష్, కోదాడ మండల అధ్యక్షులు ఎస్.కె . కొర్నేలి బాబు కోదాడ టౌన్ అధ్యక్షులు, పాస్టర్ సైమన్ పాస్టర్ పాల్చారి , నడిగూడెం మండల అధ్యక్షులు ఏసురత్నం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో,చిలుకూరు మండల పాస్టర్స్ నూతన కమిటీ సభ్యులు
గౌరవ అధ్యక్షులు పాస్టర్ యేసు బాబు అధ్యక్షులు పాస్టర్ ,ఏ అబ్రహం వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ .వి పరమ జ్యోతి తో పాటు
సెక్రెటరీ – పాస్టర్ సంతోష్ పాల్
ట్రెజరర్ -పాస్టర్ వై ఇస్మాయిల్.
చీఫ్ కోఆర్డినేటర్ – పాస్టర్.ఆర్ జాషువా.
ఎగ్జిక్యూటివ్ నెంబర్ – పాస్టర్ హానోక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పాస్టర్ వి. రవితేజ తదితరులు పాల్గొన్నారు.


