📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణYadadri Bhuvanagiriప్రారంభించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు.

ప్రారంభించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు.

📰 Generate e-Paper Clip

*జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్ లకు 3 రోజుల శిక్షణ…*

 

*ప్రారంభించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు.*

*జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్ లకు 3 రోజుల శిక్షణ…*

  1. *ప్రారంభించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు.*

*జనగణన దేశ అభివృద్ధికి ముఖ్యమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి మార్చి 24*

జనగణన-2027 ఫేస్-1 గృహాల జాబితా , గృహ గణన నిర్వహణలో భాగంగా నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు , జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్ లకు మంగళవారం రోజు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం లోమూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర హాజరై , నూతనంగా ఎంపికైన వారికి పలు కీలక సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ టెక్నికల్ అసిస్టెంట్ , ఛార్జ్ క్లర్క్ లకు శిక్షణ కార్యక్రమం నేటి నుంచి మూడు రోజుల (24 నుంచి 26) పాటు ఉంటుందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లడుతూ జనగణన దేశ అభివృద్ధికి ముఖ్యమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని తెలిపారు. ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేసే విధానాన్ని , అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాలని , డేటా సేకరణలో పార దర్శకత పై , ఇతర వివరాలపై మీరందరూ ఈ శిక్షణలో ప్రతి అంశాన్ని బాగా నేర్చు కోవాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సీపీఓ వెంకటరమణ , తదితరులు పాల్గొన్నారు.

*జనగణన దేశ అభివృద్ధికి ముఖ్యమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ.*

 

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి మార్చి 24*

 

జనగణన-2027 ఫేస్-1 గృహాల జాబితా , గృహ గణన నిర్వహణలో భాగంగా నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు , జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్ లకు మంగళవారం రోజు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం లోమూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర హాజరై , నూతనంగా ఎంపికైన వారికి పలు కీలక సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ టెక్నికల్ అసిస్టెంట్ , ఛార్జ్ క్లర్క్ లకు శిక్షణ కార్యక్రమం నేటి నుంచి మూడు రోజుల (24 నుంచి 26) పాటు ఉంటుందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లడుతూ జనగణన దేశ అభివృద్ధికి ముఖ్యమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని తెలిపారు. ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేసే విధానాన్ని , అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాలని , డేటా సేకరణలో పార దర్శకత పై , ఇతర వివరాలపై మీరందరూ ఈ శిక్షణలో ప్రతి అంశాన్ని బాగా నేర్చు కోవాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సీపీఓ వెంకటరమణ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular