📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తపాలా కార్యాలయంలో చోరీ, నగదు గల్లంతు* 

తపాలా కార్యాలయంలో చోరీ, నగదు గల్లంతు* 

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల, స్థానిక పోస్ట్ ఆఫీసులో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్ ఆఫీస్ వెనుక భాగాన వున్న కిటికీ చువ్వలు విరచి బీరువాలో వున్న 2లక్షల 87 వేల రూపాయలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు పిర్యాదు అందడం జరిగింది. వెంటనే సీఐ హేమసుందర్ రావు, ఎస్ఐ హనుమంతు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ లో సీసీ కెమెరాలు లేకపోవడం పోస్టల్ సిబ్బంది భాద్యతారాహిత్యానికి నిదర్శనమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పలు రకాలుగా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మంగళవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది బీరువా తలుపులు పగలగొట్టి ఉండడంతో కంగారుపడి పోలీసులకు పిర్యాదు చేశారు. కేసును ఛేదించేందుకు క్లూస్ టీమ్ కూడా వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular