📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకేజీబీవీ హాస్టల్ నుంచి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

కేజీబీవీ హాస్టల్ నుంచి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

📰 Generate e-Paper Clip

కేజీబీవీ హాస్టల్ నుంచి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోత్కపల్లి పోలీసుల కేసు నమోదు..
దర్యాప్తు ప్రారంభం

ఓదెల, సెప్టెంబర్ 20: ఓదెల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక అదృశ్యమైన ఘటనపై పోత్కపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 20వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:40 గంటల నుంచి ఉదయం 9:00 గంటల మధ్య బాలిక హాస్టల్ ఆవరణ నుంచి కనిపించకుండా పోయింది. ఉదయం 3:40 గంటల సమయంలో బాలిక స్నానానికి వెళ్తుండగా చివరిసారిగా చూసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం ఉదయం 9:00 గంటల సమయంలో టిఫిన్ సమయంలో విద్యార్థినుల హాజరు పరిశీలించగా సదరు బాలిక కనిపించకపోవడంతో హాస్టల్ సిబ్బంది ఆరా తీశారు.
బాలిక ఆచూకీ కోసం హాస్టల్ పరిసర ప్రాంతాలతో పాటు సాధ్యమైన ప్రదేశాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాలిక అదృశ్యానికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ, ఆమె ఆచూకీ కోసం దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.