చెంగిచెర్ల, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): చెంగిచెర్ల డివిజన్ జయప్రద కాలనీలో నూతన కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీధి నంబర్ల సూచిక బోర్డులను మాజీ కార్పొరేటర్, కాలనీ గౌరవ అధ్యక్షుడు బింగి జంగయ్య యాదవ్, అరవింద కాలనీ అధ్యక్షుడు చిన్న ముదిరాజ్తో కలిసి కాలనీ అధ్యక్షురాలు చింతపంటి కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగయ్య యాదవ్ మాట్లాడుతూ, వీధి సూచిక బోర్డుల ఏర్పాటు అభినందనీయమని, కొత్తగా వచ్చే వారు, కొరియర్, అత్యవసర సేవల సిబ్బందికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. కాలనీ సంక్షేమానికి అందరి సహకారంతో పనిచేస్తామని అధ్యక్షురాలు కవిత తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చీరల నీలమ్మ, ఉపాధ్యక్షుడు జీ. హరి నాయక్, కోశాధికారి ఓక్ ఓబులేసు, జాయింట్ సెక్రటరీ పి. పౌలు, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
జయప్రద కాలనీలో వీధి సూచిక బోర్డుల ప్రారంభం
RELATED ARTICLES

