రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నసంతర్పణ
మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 17 (జోగిపేట ) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
అందోల్–జోగిపేట మున్సిపాలిటీ 15వ వార్డులో రజక సంఘం సోదరులు ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా వినాయకుడిని ప్రతిష్ఠించుకుని భక్తిశ్రద్ధలతో నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విఘ్నాలకు అధిపతి అయిన శ్రీ విఘ్నేశ్వరుడికి ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా రవిశంకర్ దంపతుల ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అందోల్ -జోగిపేట్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు )పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం.ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
కార్యక్రమానికి ఆహ్వానించిన 15వ వార్డు రజక సంఘం సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

