తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా తాళ్లపల్లిలో జెండా ఆవిష్కరణ
తాళ్లపల్లి, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని తాళ్లపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్ తెలిపారు.
గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా తాళ్లపల్లిలో జెండా ఆవిష్కరణ
RELATED ARTICLES

