*జనగాం పాండు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే…*
*మారమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పైళ్ల శేఖర్ రెడ్డి.*
*సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు , తుక్కాపురం గ్రామ సర్పంచ్ జనగాం పాండు తల్లిగారైన స్వర్గీయ జనగాం మారమ్మ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి సోమవారం రోజు పరామర్శించి తమ సంతాపాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన జనగాం మారమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
శోకసప్తమైన పాండుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కష్టసమయంలో పార్టీ జనగాం పాండు కుటుంబా నికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో కేశవపట్నం రమేష్ , ర్యాకల శ్రీనివాస్ నోముల మహేందర్ రెడ్డి , పుట్ట వీరేష్ , రాసాల మల్లేశం , శేఖర్ , లింగ స్వామి , జనగాం మహేష్, సుభాష్ , అశోక్ బీఆర్ఎస్ పార్టీ నాయ కులు , ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొని మారమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
జనగాం పాండు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
RELATED ARTICLES

