ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి
పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేత
మహబూబాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి, సెప్టెంబర్ 10(ప్రజా వాణి )సాయుధ పోరాట యోధురాలు,వీర వనిత చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని రజక సంఘం,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గార్ల మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మధు నాయుడుకు గురువారం వినతిపత్రం అందించారు.తెలంగాణ కోసం రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్కల సరసాన ఐలమ్మ చేరిందని,అలాంటి ధీరవనిత విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో రజక కుల పెద్దలు కట్టెం వెంకన్న,కె.శంకర్,కె.శ్రీను, ఆర్.నరేష్,ఏ.కృష్ణ,ఎ. నాగమణి,జి.గోపి,జె. భాస్కర్,ప్రజా సంఘాల నాయకులు కందునూరి శ్రీనివాస్,అలవాల సత్యవతి,అంబటి వీరా స్వామి,కె. ఈశ్వర్ లింగం,కె. రామకృష్ణ, సిహెచ్. మౌనిక, ఎస్. నాగరాజు, జి. వీరభద్రం,టీ. నాగేశ్వరావు, డి. ప్రవీణ్, వార్డు సభ్యులు ఎల్. పూర్ణచందర్, కె. సాయి, టీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

