గుగ్గిళ్లలో విద్యుత్ సమస్యలను పరిశీలించిన సిబ్బంది
హెచ్జీ ఫ్యూజ్ మార్పు, తీగల తొలగింపు
బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో బెజ్జంకి విద్యుత్ సెక్షన్ పరిధిలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంబంధిత సమస్యలను సిబ్బంది పరిశీలించారు.
గ్రామంలో హెచ్జీ ఫ్యూజ్ను మార్చడంతో పాటు విద్యుత్ స్తంభాలకు అల్లుకున్న తీగలను తొలగించారు. అలాగే ఎర్తింగ్ వైర్ను తిరిగి అనుసంధానం చేశారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఏఈ మహేష్, లైన్మెన్ మల్లయ్య, జూనియర్ లైన్మెన్ నరేష్ పాల్గొన్నారు.

